అంతర్జాతీయం
South Korea: దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం.. 28 మంది మృతి..

South Korea: దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ముయూన్ ఎయిర్పోర్టులో రన్వేపై విమానం అదుపు తప్పి రక్షణగోడను ఢీకొట్టింది. దీంతో.. భారీగా మంటలు చెలరేగి విమానం పేలిపోయింది. ప్రమాదం సమయంలో విమానంలో 175 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు.
28 మంది మృతి చెందినట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. బ్యాంకాక్ నుంచి ముయూన్ వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.