తెలంగాణ
మహబూబ్ నగర్ జిల్లాలో తీరని యూరియా కష్టాలు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా యూరియా కష్టాలు తీరడం లేదు. ఎరువుల కోసం అన్నదాతలు ఆందోళన బాట పట్టారు. సరిపడా ఎరువులు ఇవ్వకపోతే పంట నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
వనపర్తి జిల్లా ఖిల్లా గణపురం మండలంలో తెల్లవారుజాము నుండే రైతు వేదికల వద్దకు చేరుకొని గంటల తరబడి క్యూలైన్ల దగ్గర నిలబడిన యూరియా అందట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టోకెన్లు రాసిచ్చినా కూడా యూరియా ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు.



