తెలంగాణ
Suryapet: నేరేడుచర్లలో దగ్ధమైన పత్తి లారీ

Suryapet: సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో వాన దంచికొట్టింది. ఉరుములు-మెరుపులతో కూడిన వాన కురిసింది. అంతేకాదు చిల్లేపల్లి వద్ద లారీపై పిడుగు పడింది. అయితే ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైంది లారీ. కరీంనగర్ నుంచి చెన్నైకి పత్తిలోడుతో లారీ వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంలో ప్రాణనష్టం జరగకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఫైర్ సిబ్బంది వచ్చేలోపే అగ్నికి లారీ ఆహుతైంది.