తెలంగాణ

Aadi Srinivas: బీసీ ద్రోహులు, వెన్నుపోటు దారులు.. బీజేపీ నాయకులే

Aadi Srinivas: రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్నది బీజేపీ నేతలేనని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆరోపించారు. బీసీల గొంతు కోసిన బీజేపీ నాయకులు ఇప్పుడు రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. బీసీలకు రిజర్వేషన్లు రాకుండా అడ్డుకున్నది బీజేపీ నాయకులేనని.. బీజేపీ నేతలు.. బీసీ ద్రోహులు, వెన్నుపోటు దారులని సంచలన వ్యాఖ్యలు చేశారు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేసిందన్నారు. తాము పంపిన బిల్లులను ఆమోదించకుండా బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అడ్డుపడటం దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించకుండా నోరు మూసుకున్న బీజేపీ నాయకులు ఇప్పుడు రేవంత్ రెడ్డిపై ఎగిరెగిరి పడుతుండటం హాస్యాస్పదమన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button