ఆంధ్ర ప్రదేశ్

కష్టాల్లో మామిడి రైతులు

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. తిరుపతి, చిత్తూరు జిల్లాల కలెక్టర్ లు హెచ్చరించినా, ఆదేశించినా వ్యాపారస్తులు బయటపడటం లేదు. ఫలితం మామిడి రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారు. ఆదుకోండయ్యా అంటూ చేతులెత్తి మొక్కుతున్నారు. ప్రభుత్వం 4 రూపాయలు, వ్యాపారస్తులు, జ్యూస్ కంపెనీల యాజమానాలు 8 రూపాయలిచ్చి మొత్తం కిలో 12 రూపాయల చొప్పున కొనాలని ఆదేశించినా లెక్క చేయడం లేదు.

ఈ ఏడాది రైతులను తీవ్రంగా దెబ్బతీయడానికి ఒక మాఫియాగా వ్యాపారస్తులు సిండ్ కేట్ అయ్యారనే ఆరోపణలు బలంగా వినపడుతున్నాయి. చేతికొచ్చిన మామిడి పంట అమ్ముకోలేక రోడ్ల పక్కన, చెరువు గట్లపైన, చెట్ల పొదల్లో పారబోస్తున్నారు రైతులు.

చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మామిడి రైతులకు దారుణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. మామిడి పంటల దిగుబడికి చిత్తూరు జిల్లా పెట్టింది పేరు. మిట్ట ప్రాంతాలు కావడంతో సారవంతమైన భూములు ఉన్నాయి. ఇందులో రైతులు మామిడి ఎక్కువగా తిగుబడి చేస్తారు. తోతాపూరీ మామిడి రకం పంట దిగుబడి ఎక్కువగా ఉంటుంది. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని దామలచెరువు మ్యాంగో మార్కెట్ మూడు రాష్ట్రాలకు అనుబంధం.

ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి మామిడిపండ్లు ఎగుమతులు జరుగుతూ ఉంటాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రైతులందరూ ఈ దామలచెరువు మ్యాంగో మార్కెట్‌కి ప్రతి సంవత్సరం చేతికొచ్చి పంటను తీసుకుని వెళ్లి అమ్ముకుంటూ ఉంటారు.

ఈ జిల్లాలో చాలా ప్రాంతాలు గుజ్జు పరిశ్రమలు ఉన్నాయి. కానీ ఈ సంవత్సరం రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. గిట్టుబాటు ధర దేవుడెరుగు అసలు కొనేందుకు ముందుకు రావడంలేదు వ్యాపారస్థులు. గుజ్జు ఫ్యాక్టరీల వద్ద రోజుల తరబడి నిరీక్షించినా జ్యూస్ తయారీ కంపినీలు కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదు.

తోతాపూరి మామిడి పంట చెట్లల్లోనే మాగి కింద పడిపోతున్నాయి. ప్రభుత్వ ఆదేశాలు ఏ మాత్రం పట్టించుకోని వ్యాపారస్థులు, కంపెనీల యాజమాన్యాలు అందరూ సిండ్ కేట్ అయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. రేట్లు పక్కన పెడితే అసలు కొనేందుకు విముఖత చూపడం లేదు‌.

చిత్తూరు జిల్లాలో పూతలపట్టు, బంగారు పాల్యం మదనపల్లి, పీలేరు , పుంగనూరు మండలాల్లో ఒక లక్షా 60వేలహెక్టార్లలో మామిడి పంట విస్తరించి ఉంది. గత రెండు సంవత్సరాలుగా పంట దిగుబడి తగ్గడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈసారైనా దిగుబడులు బాగా వచ్చి ధర కూడా ఆశించిన రీతిలో ఉంటే ఎంతో కొంత లాభపడదామని మామిడి రైతులు ఎన్నో కలలు కన్నారు.

అయితే వాతావరణ మార్పులు కారణంగా దిగుబడి బాగా ఉన్నా రేట్లు మాత్రం అంతంత మాత్రమే ఉన్నాయి. వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి రైతుల నుంచి మామిడికాయలు కొనడం లేదు. దీంతో రైతులు రోడ్ల పక్కన కింద పోసి వెళ్లి పోతున్నారు.

గతేడాది చిత్తూరు జిల్లా నుండి మామిడి పల్ప్‌ ఎగుమతి కాకపోవడంతో జిల్లాలోని అన్ని మామిడి గుజ్జు పరిశ్రమల్లో టన్నుల కొద్దీ పల్ప్‌ నిల్వ ఉంది. అందువలన తాము కొనడం లేదని ఆలాంటి గుజ్జు సేకరించే కంపెనీలు చెబుతున్నాయి. ఈసారి మామిడి గుజ్జు పరిశ్రమలు రైతుల వద్ద నుండి కొనుగోలు చేయక పోవడంతో మామిడి పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారు.

చిత్తూరు జిల్లా నుండి ఉండే పరిశ్రమల నుండి వచ్చే మామిడి పల్ప్‌ ఈసారి కూడా విదేశాలకు ఎగుమతి అయ్యే అవకాశం లేకపోయింది. ఉత్తర భారతదేశంలో పలు రాష్ట్రాల్లో చిత్తూరు జిల్లా నుంచే మామిడి కాయలు ఎగుమతి అవుతాయి. సాధారణంగా ఎకరా మామిడి తోటలో ఆరు నుండి ఐదు టన్నులకు దిగుబడి వస్తుంది. అందులో ఈసారి 60 శాతం పంట వచ్చినా గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button