ఆంధ్ర ప్రదేశ్
PSR Anjaneyulu: ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులుకు అస్వస్థత

PSR Anjaneyulu: నటి జత్వానీ కేసులో కీలక నిందితుడు పీఎస్ఆర్ ఆంజనేయులును.. ఈ నెల 25న విజయవాడ కోర్టు మూడు రోజుల పాటు సీఐడీ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా న్యాయవాదుల సమక్షంలోనే విచారణ చేపట్టాలని సదరు అధికారులకు సూచించింది. ప్రస్తుతం విజయవాడ సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆంజనేయులను ఇవాళ సీఐడీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు.
కేసులో కీలక విషయాలపై ప్రశ్నించి ఆయన నుంచి సమాచారం రాబట్టి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని సీఐడీ అధికారులు భావించారు. కానీ అనూహ్యంగా పీఎస్ఆర్ ఆంజనేయులు ఇవాళ ఉదయం అస్వస్థతకు గురయ్యారు. దీంతో అధికారులు ఆయనను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ క్రమంలోనే వైద్య పరీక్షల అనంతరం ఇవాళ అధికారులు తిరిగి ఆంజనేయులు విచారిస్తారా..? లేక సోమవారానికి వాయిదా వేస్తారా అనేది వేచి చూడాలి.