సింగరేణి బ్లాస్టింగ్లతో పల్లెలు విధ్వంసం

Singareni Blasts: పెద్దపల్లి జిల్లాలో సింగరేణి బ్లాస్టింగ్లతో పల్లెలు విధ్వంసానికి గురైతున్నాయి. రామగిరి మండలంలోని ఓపెన్ కాస్ట్2 బొగ్గు గనిలో భారీ పేలుడు సంభవించింది. బొగ్గు తవ్వకాల కోసం సింగరేణి అధికారులు భారీ బ్లాస్టింగ్ పెట్టారు. పేలుడు ధాటికి చుట్టుపక్కల గ్రామాలు కంపించాయి.
నాగేపల్లి, లద్నాపూర్, రాజాపూర్, పన్నూర్, ఆదివారంపేట గ్రామాల్లో భూకంపం తరహాలో ప్రకంపనలు వచ్చాయి. దీంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పేలుడు ధాటికి ఇండ్లపై రాళ్లు, మట్టి ఎగిరిపడ్డాయి. ఇండ్లు స్వల్పంగా ధ్వంసమైయ్యాయి. పలువురు గ్రామస్తులకు గాయాలయ్యాయి.
బొగ్గు గని వద్ద గ్రామస్తులు ఆందోళనకు దిగారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ కాంట్రాక్టర్లు వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు మండిపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ నిర్వహించడం వల్ల దుమ్ము, ధూళితో రోగాల బారిన పడుతున్నట్లు స్థానికులు వాపోతున్నారు. ఎన్జీటీ, మైనింగ్ చట్టాలకు వ్యతిరేకంగా అధికారుల వ్యవహరిస్తున్నారని స్థానికులు విమర్శించారు. ఓపెన్ కాస్ట్ బ్లాస్టింగ్లను నిలిపివేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.