ఆంధ్ర ప్రదేశ్
Nara Lokesh: వంద పాకిస్థాన్లు వచ్చినా భారత్ను ఏమీ చేయలేరు

Nara Lokesh:వెలగపూడిలోని అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవ సభలో మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్ దాడిని ఖండిస్తూ 100 పాకిస్థాన్లు వచ్చినా భారతదేశంలో గడ్డి పాచ కూడ కదిలించలేరన్నారు. 100 పాకిస్థాన్లకు సమాధానం చెప్పే ఓకే ఒక మిస్సైల్ నమో మోడీ అంటూ చెప్పుకొచ్చారు.
అనంతరం అమరావతి నిర్మాణానికి ప్రధాని మోడీ చేశారని మళ్లీ ఇవాళ పనర్ నిర్మాణ పనులకు ఆయన రావడం ఆనందంగా ఉందని లోకేష్ తెలిపారు. ఏపీలో రెండు పవర్ ఫుల్ ఇంజన్లు ఉన్నాయని ఈ డబుల్ ఇంజన్తో ఏపీ అభివృద్ధి ముందుకు సాగుతుందని చెప్పారు.