ఆంధ్ర ప్రదేశ్
Modi: రేపు ఏపీకి ప్రధాని మోదీ

Modi: ప్రధాని మోదీ రేపు ఏపీకి రానున్నారు. రాజధాని అమరావతి పునఃప్రారంభ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. 49.40వేల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అదేవిధంగా 57వేల 962కోట్ల రూపాయలతో కేంద్ర ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. రోడ్డు, రైలు ప్రాజెక్టులను ప్రారంభిస్తారు.
శాశ్వత సచివాల యం, అసెంబ్లీ, హైకోర్టు భవనాలకు శంకుస్థాపన చేస్తారు. ఇక కృష్ణా జిల్లాలోని నాగాయలంకలో మిసైల్ టెస్ట్ రేంజ్కి శంకుస్థాపన విశాఖలో యూనిటీ మాల్ నిర్మాణానికి శ్రీకారం చుడుతారు.