సినిమా
Meenakshi Chaudhary: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ నటి మీనాక్షి చౌదరి

Meenakshi Chaudhary: తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ నటి మీనాక్షి చౌదరి దర్శించుకున్నారు. తెల్లవారుజామున సుప్రభాత సేవలో ఆలయంలోకి వెళ్ళి స్వామివారిని దర్శించుకుని, హుండీలో కానుకలు సమర్పించి మొక్కలు చెల్లించారు మీనాక్షి, ఈ సందర్భంగా రంగనాయకులు మండపంలో ఆలయ సిబ్బంది ఆమెకి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. నాగచైతన్య, నవీన్ పోలిశెట్టి సరసన కథానాయకిగా సినిమా చేస్తున్నట్లు మీడియాతో అన్నారు.