ఆంధ్ర ప్రదేశ్
ఉగ్ర దాడి.. తిరుమలలో హై అలెర్ట్

Tirumala: తిరుమలలో హైఅలర్ట్ ప్రకటించింది టీటీడీ. పహల్గామ్లో ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో సెక్యూరిటీని కట్టుదిట్టం చేస్తోంది టీటీడీ. ఘాట్ రోడ్డులోని లింక్ రోడ్డు సమీపంలో వాహనా లను తనిఖీ చేస్తున్న టీటీడీ విజిలెన్స్ సిబ్బంది, అనుమానం వచ్చిన వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తోంది. చిన్నపాటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టారు అధికారులు.