తెలంగాణ
హైదరాబాద్లో ఈడీ దాడులు

ED Raids: హైదరాబాద్లో మరోసారి ఈడీ హీట్ మొదలైంది. సురానా గ్రూప్ ఛైర్మన్, డైరెక్టర్ ఇళ్లలో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఏకకాలంలో నాలుగు ప్రాంతాల్లో ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. సికింద్రాబాద్, బోయినపల్లి, జూబ్లీహిల్స్లో తనిఖీలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ప్రముఖ పారిశ్రామిక వేత్త సురానా గ్రూప్ ఛైర్మన్ నివాసంలో కూడా సోదాలు జరుగుతున్నట్లు సమాచారం.