CLP Meeting: సీఎం రేవంత్ అధ్యక్షతన సీఎల్పీ సమావేశం

CLP Meeting: కాటికి సైతం వారు కలిసే పయనించారు. మరణంలోనూ వారి బంధం వీడలేదు. భార్య చనిపోయిన గంట వ్యవధిలోనే భర్త మృతి చెందాడు. భార్య మృతదేహాన్ని చూస్తూ ప్రాణాలు వదిలాడు భర్త. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని రామచంద్రాపురంలో వెలుగులోకి వచ్చిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.
అవును కట్టుకున్న భార్య చనిపోయిన విషయం తెలిసి భర్త గుండెపోటుతో మృతి చెందాడు. యశోద అండ్ హనుమా రెడ్డి దంపతులు. ఖమ్మంలో తాత్కాలికంగా నివాసం ఉంటున్నారు.
అయితే భార్య యశోద ప్రమాదవశాత్తు కింద పడటంతో తలకి బలమైన గాయం అయింది. దీంతో చికిత్స నిమిత్తం ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ యశోద మృతి చెందింది. భార్య మరణించిందని వార్త విన్న హనుమా రెడ్డి గుండె పోటుతో మరణించాడు. గంట వ్యవధిలోనే భార్యాభర్తలు మృతి చెందటంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలను స్వగ్రామం తీసుకురాగా వారిని కడసారి చూసేందుకు గ్రామస్థులు, బంధువులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.



