తెలంగాణ
Ponnam Prabhakar: శ్రీరామనవమి ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి పొన్నం

Ponnam Prabhakar: శ్రీరామనవమి సందర్భంగా బోయిన్పల్లిలోని తాడ్బండ్ ఆంజనేయస్వామి ఆలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే శ్రీగణేష్ ప్రత్యేక పూజలు చేశారు. కళ్యాణం అనంతరం మంత్రికి వేద పండితులు స్వామివారి ఆశీర్వచనాలు అందించారు. తెలంగాణలో శ్రీరామనవమిని అందరూ సుఖసంతోషాలతో అంగరంగ వైభవంగా జరుపుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు.
శ్రీరాముని కళ్యాణంలో పాల్గొని అందరూ గ్రామలు జిల్లాలు రాష్ట్రమంతా బాగుండాలని కోరుకున్నానన్నారు. తెలంగాణ ప్రజలకు మా ప్రజాపాలన ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి రామరాజ్యం లాగా ఆనాడు రాముడు ప్రజా సమస్యలు పరిష్కారం చేస్తూ ఎలాంటి పరిపాలన చేశాడో అలాంటి పరిపాలన చేసేలా శక్తిని, కృపను ఇవ్వాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నానన్నారు.