ఆంధ్ర ప్రదేశ్
Nara Lokesh: ఏపీ అర్థికాభివృద్ధిలో విశాఖ గుండెకాయ

Nara Lokesh: ఏపీ ఆర్థికాభివృద్ధిలో విశాఖ గుండెకాయ అన్నారు మంత్రి లోకేష్ . విశాఖ బీచ్ రోడ్డులో తాజ్ వరుణ్ గ్రూప్ ఆధ్వర్యాన వరణ్ బే శాండ్స్ పేరిట నూతనంగా నిర్మించతలపెట్టిన కొత్త అత్యాధునిక హోటల్, ఆఫీస్ టవర్కు లోకేష్ తల్లి భువనేశ్వరితో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా గత పాలకులు విధ్వంసక విధానాలతో ఏపీ పారిశ్రామిక, వ్యాపార వాతావరణానికి అపారమైన నష్టాన్ని కలిగించారన్నారు.
అప్పటి ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతో ఎంతోమంది పెట్టుబడిదారులు పొరుగురాష్ట్రాలకు తరలివెళ్లారు. ప్రధాన ప్రాజెక్టులన్నీ నిలిచిపోయాయి. గత ప్రభుత్వ తిరోగమన విధానాలు ఆర్థిక స్తబ్దతకు దారితీశాయని చెప్పారు.