తెలంగాణ
హైదరాబాద్లోని HCU వద్ద టెన్షన్.. టెన్షన్..

హైదరాబాద్లోని HCU వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ ఎదుట భారీగా పోలీసులు మోహరించారు. వర్సిటీ మెయిన్ గేట్ దగ్గర బలగాలు మోహరించా యి. మరోవైపు యూనివర్సిటీ లోపలికి వెళ్తున్న విద్యార్థులను అలాగే ఉద్యోగుల గుర్తింపు కార్డులను సిబ్బంది పరిశీలిస్తోంది. ప్రధానంగా HCUకి చెందిన 400ఎకరాల భూమిని ప్రభుత్వం అమ్మడాన్ని విద్యార్థి సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి.
ఇందులో భాగంగా ప్రస్తుతం జేసీబీలతో భూమిని చదునుచేపిస్తోంది రేవంత్ ప్రభుత్వం. దీంతో వర్సిటీలోకి జేసీబీలు రావడంతో విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రభుత్వం వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.