ఆంధ్ర ప్రదేశ్
నేడు పోలీస్ కస్టడీకి వల్లభనేని వంశీ

Vallabhaneni Vamsi: వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు ఇవాళ ఒక్కరోజు కస్టడీకి తీసుకోనున్నారు. వంశీని ఆత్కూరు పోలీసులు కస్టడీకి తీసుకోనున్నట్లు తెలుస్తుంది. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు విచారణ కొనసాగనుంది.
విచారణలో వంశీ స్టేట్మెంట్ కూడా రికార్డు చేసే అవకాశం ఉంది. బెదిరించి భూమిని లాక్కున్నారని వంశీపై కేసు నమోదైంది. ఇదే కేసులో వంశీని ఆత్కూరు పోలీసులు విచారించనున్నారు.