Seethakka: డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలి

Seethakka: సైదాబాద్లో వికలాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్జెంటర్ల సాధికారత ఆధ్వర్యంలో డ్రగ్ డి అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేశారు. దేశంలో మాదకద్రవ్యాల వ్యసనం విస్తృతంగా వ్యాపిస్తుంది. ముఖ్యంగా యువత మాదకద్రవ్యాలకు బానిస అవుతున్నారు. సమాజంలో ఉన్న వివిధ రకాల ప్రభావాలు, సామాజిక పరిస్థితులు యువతను మత్తు పదార్థాలు ఆకర్షిస్తున్నాయి.
ఇదే పరిస్థితి కొనసాగితే దేశానికి మసకబారిన యువత ప్రమాదం కావచ్చు. నేరాలు పెరగొచ్చు, ఉద్యోగావకాశాలు తగ్గొచ్చు. ఈ వ్యసనాలతో సమాజానికి తీవ్రమైన ప్రమాదాలు పొంచి ఉంది. అందుకే మిషన్ పరివర్తన కార్యక్రమం ద్వారా యువతకు అవగాహన కల్పిస్తుంది డ్రగ్ డి అడిక్షన్ సెంటర్. ఈ సెంటర్ను మంత్రి సీతక్క ప్రారంభించారు. త్వరలో ఈ డీ-అడిక్షన్ సెంటర్లను అన్ని అబ్జర్వేషన్ హోమ్లలో ఏర్పాటు చేస్తామని మంత్రి అన్నారు. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని సీతక్క పిలుపునిచ్చారు.