తెలంగాణ

Jupally Krishna Rao: ఆరోగ్యం కోసం నిత్యం వ్యాయామం చేయాలి

Jupally Krishna Rao: నిత్య వ్యాయామంతోనే ఆరోగ్యం సాధ్యమని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శేరిలింగంపల్లి ఆల్విన్ కాలనీ తులసి వనం వద్ద అవని స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఐదు కిలోమీటర్ల పరుగు కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఉన్నచిన్న జీవితంలో ఏ పని చేయాలన్న ఆరోగ్యం ప్రధానమని మంత్రి తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం కోసం నిత్యం వ్యాయామం చేయాలన్నారు. ఇలాంటి సామాజిక కార్యక్రమాలు తరచూ చేపడుతుండాలని సూచించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button