తెలంగాణ
నేడు ఢిల్లీకి సీఎం రేవంత్రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి బయల్దేరనున్నారు. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క AICC పెద్దలను కలవనున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మె ల్సీ అభ్యర్థిత్వాలపై అధిష్టానంతో చర్చించనున్నారు. దీంతో రెండు లేక మూడు రోజుల్లో క్లారిటీ రానుంది.
అంతకుముందే అభ్యర్థుల పేర్ల ఖరారుపై పార్టీ నేతలతో సీఎం రేవంత్ చర్చిం చనున్నారు. అదే నివేదిక ఏఐసీసీ పెద్దలకు సీఎం రేవంత్ అందించనున్నారు. అలాగే రెండురోజులు ఢిల్లీలోనే బస చేయనున్న సీఎం రేవంత్.. ఓ ఛానెల్ కాంక్లేవ్లో పాల్గొననున్నారు.