తెలంగాణ
Medchal: క్రికెట్ బెట్టింగ్ కారణంగా మరో యువకుడు బలి

Cricket betting: క్రికెట్ బెట్టింగ్ కారణంగా మరో యువకుడు బలయ్యాడు. క్రికెట్ బెట్టింగ్లో నష్టపోయి 29 ఏండ్ల యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లికి చెందిన సోమేశ్ క్రికెట్ బెట్టింగ్లో రెండు లక్షలు పోగొట్టుకున్నాడు. మనోవేదనకు గురైన సోమేష్ గౌడవెల్లి పరిధిలోని రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.