ఆంధ్ర ప్రదేశ్
Botsa: సీఎం హోదాలో చంద్రబాబు మాట్లాడినట్లు ఎవరూ మాట్లాడలేదు

Botsa Satyanarayana: దేశ చరిత్రలో సీఎం హోదాలో చంద్రబాబు మాట్లాడినట్లు ఎవరూ మాట్లాడలేదని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. వైసీపీ వాళ్లకు పనిచేయొద్దని ముఖ్యమంత్రి ఎలా చెబుతారంటే సమాధానం లేదని బొత్స మండిపడ్డారు. రుషికొండ భవనాల నిర్మాణంలో అవినీతి జరిగితే కాంట్రాక్టర్లకు బిల్లులు ఎందుకు చెల్లించారని ఆయన ప్రశ్నించారు.
రుషికొండ నిర్మాణలపై విచారణకు సిద్ధం ఉన్నామని బొత్స స్పష్టం చేశారు. ఇప్పుడున్న అసెంబ్లీ , సెక్రటేరియట్ రెండూ తాత్కాలికమని గత ప్రభుత్వం తెలిపిందన్నారు. రాజధానిపై పార్టీ విధానం ఏమిటనేది చర్చించి చెబుతామని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తెలిపారు.