ఆంధ్ర ప్రదేశ్
Ayyannapatrudu: వైసీపీ సభ్యుల తీరును తప్పుబట్టిన స్పీకర్

Ayyannapatrudu: వైసీపీ సభ్యుల తీరును స్పీకర్ అయ్యన్నపాత్రుడు తప్పుబట్టారు. శాసనసభలో నిన్న జరిగిన ఘటన బాధ కలిగించిందన్నారు ఆయన. అతిథిగా వచ్చిన గవర్నర్ను గౌరవించాల్సి ఉందని గుర్తుచేశారు. పోడియం దగ్గర పేపర్లు చింపి విసరడం సరైన పద్ధతి కాదన్నారు. సీఎంగా పనిచేసిన వ్యక్తి సభ్యత మరచి ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు అయ్యన్న పాత్రుడు.
ఇక తన పార్టీ నేతల తీరును నియంత్రించాల్సింది పోయి జగన్ కూర్చుని నవ్వుకుంటారా? అంటూ నిలదీశారు. బొత్స కూడా సభలో ఉండి జగన్కు అది తప్పు అని చెప్పకపోవడం దారుణమన్నారు. సభలో జరిగే ఇలాంటి ఘటనలను అందరూ ఖండించాలన్నారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు.