తెలంగాణ
నిర్మల్ జిల్లా ముజ్గిలో ఘనంగా మల్లన్న జాతర

నిర్మల్ జిల్లా ముజ్గిలో ముజ్గి మల్లన్న జాతర ఘనంగా కొనసాగుతున్నాయి. ఐదురోజులపాటు ఈ జాతర జరగనుంది. రెండో రోజూ సల్లకుండలను తలపై ఎత్తుకొని నడుచుకుంటూ ఆలయానికి చేరుకున్నారు స్థానికులు.
స్వామివారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. జాతరకు భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.