బంగ్లాదేశ్లో మళ్లీ చెలరేగిన హింస

బంగ్లాదేశ్లో మళ్లీ హింసాత్మక ఘటనలు చెలరేగాయి. అవామీలీగ్ పార్టీ నేతల ఇళ్లే లక్ష్యంగా నిరసనకారులు దాడులకు దిగారు. మ్యూజియంగా మార్చిన బంగ్లాదేశ్ వ్యవస్థాపక నేత, బంగబంధు.. షేక్ హసీనా తండ్రి, ముజిబుర్ రెహమాన్ స్మారక నివాసంపై దాడి చేసి నిప్పంటించారు. మాజీ ప్రధాని షేక్ హసీనా ఆన్లైన్ వేదికగా .. మహమ్మద్ యూనస్ సారథ్యంలోని మధ్యంతర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలపాలని అవామీలీగ్ నేతలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆమె వ్యతిరేకులు రెచ్చిపోయారు.
ఢాకాలోని ముజిబుర్ రెహమాన్ స్మారక నివాసం ఎదుట ర్యాలీ నిర్వహించి ఆయన సార్మక నివాసాన్ని ధ్వంసం చేశారు. అనంతరం ఇంటికి నిప్పంటించారు. తర్వాత బంగ్లాదేశ్ వ్యాప్తంగా పలుచోట్ల అవామీలీగ్ నేతల ఇళ్లపై దాడులు చేశారు. ఇక తన తండ్రి స్మారక నివాసాన్ని ధ్వంసం చేయడంపై హసీనా ఆగ్రహం వ్యక్తం చేశారు. భవనాన్ని కూల్చివేయవచ్చు.. కానీ చరిత్రను కాదన్నారు. ఇక ముజిబుర్ రెహమాన్ స్మారక నివాసంపై దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. ప్రస్తుతం పదవి కోల్పోయి షేక్ హసీనా భారత్లో ఆశ్రయం పొందుతున్నారు.