Hanamkonda: హన్మకొండ జిల్లాలో రెచ్చిపోతున్న కబ్జా దారులు

Hanamkonda: హన్మకొండ జిల్లాలో కబ్జా దారులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు. స్థానిక సర్వే నెంబర్ 964లో ఉన్న విలువైన ప్రభుత్వ భూమిని కొంత మంది కబ్జా చేశారు. ఆ స్థలంలో షెడ్స్ వేసి నిర్మాణం చేపట్టారు. ఇదే విషయమై గతంలో రాజ్ న్యూస్ కథనాలను ప్రచారం చేసింది. దీనిపై స్పందించిన అధికారులు సర్వే చేపట్టి.. స్థలానికి హద్దులు నిర్ణయించి.. హెచ్చరిక బోర్డ్ కూడా ఏర్పాటు చేశారు.
అయితే.. కొద్ది రోజులుగా సైలెంట్ గా ఉన్న కబ్జాదారులు ఇప్పుడు మళ్లీ చెలరేగిపోతున్నారు. రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన హద్దులను, బోర్డును తొలగించి ఆ స్థలంలో మట్టిని పోశారు. మెరుగు రమేష్ అనే వ్యక్తి తప్పుడు డాక్యుమెంట్స్ సృష్టించి 4 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాజేయాలని చూస్తున్నారని.. రెవెన్యూ అధికారుల అండతోనే భూ కబ్జాదారులు రెచ్చిపోతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ భూమిని కాపాడి కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్ చేస్తున్నారు.