Hyderabad: గచ్చిబౌలిలో విదేశీ గంజాయి కలకలం.. పట్టుబడ్డ సాఫ్ట్వేర్ ఇంజనీర్

Hyderabad: హైదరాబాద్ గచ్చిబౌలిలో విదేశీ గంజాయి కలకలం రేపింది. ప్రశాంతీ హిల్స్ టింబర్ లేక్ వ్యాలీ వద్ద గంజాయి విక్రయిస్తూ ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పట్టుపడ్డాడు. మరో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పరారయ్యాడు. నిందితుడి వద్ద నుంచి 170 గ్రాముల ఫారిన్ గంజాయి, 1 కేజీ లోకల్ గంజాయి, బైక్, మొబైల్ ఫోన్ను ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ టీమ్ సీజ్ చేసింది. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియా నుండి హైదరాబాద్కు విదేశీ గంజాయి స్మగ్లింగ్అయినట్లు అధికారులు గుర్తించారు.
బెంగుళూర్ డెలాయిట్ సాఫ్ట్వేర్ కంపనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పని చేస్తున్న శివరామ్ అనే వ్యక్తి ప్రశాంతీ హిల్స్ టింబర్ లేక్ వ్యాలీ వద్ద గంజాయి విక్రయిస్తుండగా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు పట్టుకుంది. మరో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అజయ్ అక్కడి నుండి పారిపోయాడు. ఈ ఇద్దరు కలిసి ప్రతి వీకెండ్లో డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నారు.
బెంగళూరులో లోకల్ గంజాయిని కొనుగోలు చేసి.. పోలీసులకు ఏమాత్రం అనుమానం రాకుండా ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో సరఫరా చేశారు. ఐటి క్యారిడార్ హాస్టల్స్లో ఉండే విద్యార్దులే టార్గెట్గా గంజాయి అమ్మకం చేస్తున్నారు. శివరామ్తో పాటు అజయ్పై పోలీసులు ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అజయ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.