Telangana: భార్యను చంపి ముక్కలు చేసి.. కుక్కర్లో ఉడికించిన కసాయి భర్త

Telangana: ఆలస్యంగా వెలుగులో వచ్చిన ఘటన. ఈనెల 13న భార్య పై అనుమానంతో ముక్కలు,ముక్కలుగా నరికి డెడ్ బాడీని కుక్కర్లో ఉడక పెట్టి అనంతరం శరీర భాగాలను చెరువులో పడేసిన భర్త గురుమూర్తి. రంగారెడ్డి జిల్లా రాచకొండ కమిషనరేట్ మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఘటన. మృతురారి తల్లిదండ్రుల మీర్ పేట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు. గురుమూర్తి ఆర్మీలో పని చేసి ప్రస్తుతం DRDOలో ఔట్సోర్సింగ్ సెక్యూరిటీగా పనిచేస్తూ జిల్లెల్లగూడలోని న్యూ వెంకటేశ్వర నగర్ కాలనీలో భార్య వెంకట మాధవి(35)తో నివాసముంటున్నారు.. వీరికి ఇద్దరు పిల్లలు.
ఈనెల 13న మిస్సింగ్ అయినట్టు మీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన మృతురాలి తల్లిదండ్రులు. ఫిర్యాదు చేస్తున్న సమయంలో తనకు ఏం తెలియదు అన్నట్టుగా అత్తమామలతో కలిసి మీర్పేట్ పీఎస్ కు వచ్చిన మృతురాలి భర్త. కేసు నమోదు చేసిన విచారణలో భాగంగా గురుమూర్తిని విచారించగా అతనే హత్య చేసినట్లు నిర్ధారించిన పోలీసులు. తన భార్యను చంపడానికి ముందు కుక్కను చంపి తర్వాత భార్యను హతమార్చినట్లు సమాచారం.