ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సంక్రాంతికి వస్తున్నాం చిత్ర బృందం

Tirumala: తిరుమల శ్రీవారిని సంక్రాంతికి వస్తున్నాం చిత్ర బృందం సభ్యులు దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ సమయంలో నిర్మాత దిల్ రాజు, దర్శకుడు అనిల్ రావిపూడి, హీరోయిన్లు మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్, సంగీత దర్శకుడు భీమ్స్ స్వామి సేవలో పాల్గొన్ని మొక్కులు చెల్లించుకున్నారు.
దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించగా..ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు.