ఆంధ్ర ప్రదేశ్
ఏనుగుల దాడి.. సీఎం చంద్రబాబు సన్నిహితుడు మృతి

తిరుపతి జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. పంట పొలాలపై ఏనుగుల గుంపు దాడి చేసింది. అంతేకాదు.. తరిమేందుకు వెళ్లిన రైతులపై కూడా ఏనుగులు దాడి చేశాయి. గజరాజుల దాడిలో నారావారిపల్లె ఉపసర్పంచ్ రాకేష్ మృతి చెందాడు.
చంద్రగిరి మండలం మామిడి మానుగడ్డలో ఘటన జరిగింది. మృతుడు రాకేష్ సీఎం చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడు. రాకేష్ మృతితో నారావారిపల్లెలో విషాద ఛాయలు అలుముకున్నాయి.