News

Raja Singh: బీజేపీ అధికారంలోకి రాగానే ఒవైసీ బ్రదర్స్‌ను పాకిస్తాన్ పంపిస్తాం

Raja Singh: ఒవైసీ బ్రదర్స్ తీరుపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ నిప్పులు చెరిగారు. దేశంలో ఉండి భారత్ మాతాకీ జై అని ఎందుకు చెప్పరంటూ నిలదీశారు. దేశంలో ఉంటే వందేమాతరం పాడాల్సిం దే అన్నారు రాజాసింగ్. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది బీజేపీయే అన్నారు ఆయన. అయితే.. బీజేపీ అధికారంలోకి వస్తే తామంటే ఏంటో చూపిస్తామన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే ఒవైసీ బ్రదర్స్‌ను పాకిస్తాన్ పంపిస్తామంటూ హెచ్చరించారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.

ఒవైసీ బ్రదర్స్ అరుపులకు ఎవరూ భయపడరు అని చెప్పారు రాజాసింగ్. ఓవైపు మోదీ, మరోవైపు యోగి.. ఈ ఇద్దరి వైపు దేశం మొత్తం చూస్తోందన్నారు. వక్ఫ్ బోర్డ్ రాకముందు 4వేల ఎకరాల భూములు ఉండేవని గుర్తుచేసిన రాజాసింగ్.. వక్ఫ్ బోర్డ్‌ను అడ్డం పెట్టుకుని దాదాపు 9లక్షల 50ఎకరాల భూములు కబ్జా చేశారని ఆరోపించారు. ఇక వక్ఫ్ బోర్డు బిల్లు తేవడం ముస్లీంలకు వ్యతిరేకం కాదని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ క్లారిటీ ఇచ్చారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button