ఆంధ్ర ప్రదేశ్
జైలు నుంచి విడుదలైన వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి

వైసీపీ నేత మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి .. నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. జంట హత్యల కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆరోపణలు ఎదుర్కొని జైలుకు వెళ్లిన ఆయనకు గురజాల కోర్టు ఇటీవలె బెయిల్ మంజూరు చేసేది. దీంతో దాదాపు 99 రోజుల పాటు జైలులో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. తాజాగా విడుదలయ్యారు. ఈ సందర్భంగా పిన్నెల్లి బయటికి రావడంతో జైలు వద్దకు భారీగా చేరుకున్న వైసీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి.. ఆయనకు ఘన స్వాగతం పలికారు.



