తెలంగాణ

కొండగట్టు అంజన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు

Kondagattu: జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. వరుస సెలవు దినాలు కావడంతో భక్తులు తరలివస్తున్నారు. సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా కొండగట్టు అంజన్న స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీ.

ఈ నేపథ్యంలోనే సుమారు 20 వేల మందికి పైగా భక్తులు అంజన్న స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయ పరిసరాలు భక్తజనంతో కిటకిటలాడుతున్నాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు ఆలయ అధికారులు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button