ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమల శ్రీవారికి భారీ బంగారు కానుక

Tirumala: తిరుమల శ్రీవారికి ఓ మఠాధిపతి భారీ బంగారు కానుక సమర్పించారు. 1.80 కోట్లు విలువైన 15 బంగారు పతకములు, 2 వెండి పళ్లాలను కానుకగా సమర్పించారు శ్రీ సంస్థాన గోకర్ణ పర్తగాలి జీవోత్తమ మఠాధిపతి శ్రీమద్ విద్యాధీశ తీర్థ స్వామీజీ.
రంగనాయకుల మండపంలో ఆలయ పేష్కార్ రామకృష్ణ కు కానుకను అందజేశారు. మఠాధిపతి సమర్పించిన బంగారు పతకములను ఉత్సవమూర్తుల అలంకరణకు వినియోగించనున్నారు ఆలయ అర్చకులు.



