తెలంగాణ
హైదరాబాద్లో రేపు గణేష్ నిమజ్జనం

Ganesh immersion: హైదరాబాద్లో రేపు గణేష్ నిమజ్జనం జరగనుంది. గణేష్ శోభాయాత్రకు సర్వం సిద్ధమైంది. హుస్సేన్ సాగర్ చుట్టూ భారీ ఏర్పాట్లు చేశారు. 50 వేల విగ్రహాలు నిమజ్జనానికి వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
రేపు ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి ఉయం 6 గంటల వరకు ఆంక్షలు విధించారు. నిమజ్జనానికి 30 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. రేపు ఉదయం ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర ప్రారంభం కానుంది. రేపు మధ్యాహ్నం వరకు ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం పూర్తి కానుంది. ఇవాళ ఖైరతాబాద్ గణపతిని సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకోనున్నారు.



