ఆంధ్ర ప్రదేశ్
శ్రీశైలం ప్రాజెక్ట్కు కొనసాగుతున్న వరద నీరు

నంద్యాల జిల్లా శ్రీశైలం ప్రాజెక్ట్కు వరద నీరు కొనసాగుతుంది. 2గేట్లు 10 అడుగుల మేర ఎత్తి అధికారులు నీటిని విడుదల చేశారు. ఇన్ఫ్లో 92వేల 352 క్యూసెక్కులు ఉంది. ఔట్ఫ్లో లక్ష 20 వేల 222 క్యూసెక్కుల నీటిని సాగర్కు విడుదల చేశారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 885 కాగా..ప్రస్తుతం 882 అడుగులుగా ఉంది. ప్రస్తుతం నీటి నిల్వ 202 టీఎంసీలుగా ఉంది. కుడి, ఎడవ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.