ఆంధ్ర ప్రదేశ్
హిందూపురం నియోజకవర్గంలో మంత్రి సత్యప్రసాద్ పర్యటన

Satya Prasad: ఏపీలోని కూటమి ప్రభుత్వంలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి ప్రసాద్ ప్రభుత్వ కార్యక్రమాల లబ్దిదారులతో మాట్లాడారు.
నల్ల రాళ్లపల్లిలో సుపరి పాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఇచ్చిన మాట ప్రకారం హామీలు నెరవేస్తున్నామన్నారు. ఒకే కుటుంబంలో ఆరుగురు పిల్లలకు తల్లికి వందనం డబ్బులు పంచి వారితో ముచ్చటించారు. నీకు 13 వేలు నీకు 13 వేలు అంటూ కులాసాగా పిల్లలతో ముచ్చటించారు.



