తెలంగాణ
Warangal: కన్నతల్లిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కుమారుడు

Warangal: వరంగల్ జిల్లా సంగెం మండలంలో దారుణం జరిగింది. తల్లిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు ఓ కసాయి కొడుకు. ఘటనలో మహిళ వినోద తీవ్రంగా గాయపడింది. మెరుగైన చికిత్స బాధితురాలిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
ఇక ఘటన తర్వాత వినోద కుమారుడు పరారీ అయ్యాడు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వినోద కుమారుడి కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.