తెలంగాణ
Hyderabad: న్యూస్ ఛానల్ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య

Hyderabad: హైదరాబాద్ చిక్కడపల్లి పీఎస్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. న్యూస్ ఛానల్ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకుంది. జవహర్నగర్లోని తన నివాసంలో ఫ్యానుకు ఉరేసుకుని బలవర్మణానికి పాల్పడింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కుటుంబకలహాలే ఘటనకు కారణమని ప్రాథమికంగా నిర్ధారించా రు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన చిక్కడపల్లి పోలీసులు విచారణ చేపట్టారు.