తెలంగాణ
Rythu Bharosa: 9 రోజుల్లో రూ.9 వేల కోట్లు జమ.. నేడు ‘రైతు భరోసా’ విజయోత్సవాలు

Rythu Bharosa: నేడు రైతు భరోసా విజయోత్సవ సంబరాలు జరుగనున్నాయి. రైతు పండుగ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున సంబరాలకు ప్రభుత్వం పిలుపునిచ్చింది. 9 రోజుల్లో 9 వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి.
నేటితో ఈ రైతు భరోసా నిధుల పంపిణీ పూర్తికానుంది. దీంతో ప్రభుత్వం సంబరాలకు పిలుపునిచ్చింది. సాయంత్రం సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.