Hyderabad: పదోతరగతిలో ప్రేమ.. మందలించిన తల్లి.. ప్రియుడితో కలిసి తల్లిని చంపిన కూతురు

Hyderabad: తల్లి తన ప్రేమకు అడ్డు వస్తుందని భావించిన కూతురు, ప్రియుడు, అతని సోదరుడితో కలిసి కన్నతల్లి ప్రాణాలు తీసింది. ఈ దారుణ ఘటన హైదరాబాద్లోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. నగరంలోని ఎన్ఎల్బి నగర్లో నివాసం ఉంటున్న అంజలి(39)అనే మహిళ తన పదో తరగతి చదువుతున్న కూతురు తేజశ్రీ ప్రేమ వ్యవహారంపై మందలించింది. ఇదే కోపంతో తేజశ్రీ తన ప్రియుడు పగిల్ల శివ, అతని తమ్ముడు పగిల్ల యశ్వంత్ లతో కలిసి అత్యంత పాశవికంగా తల్లిని హత్య చేసింది.
తల్లి గొంతు నులిమి, తలపై రాడ్లతో కొట్టి చంపినట్లు తెలుస్తోంది. ఈ సమాచారం అందుకున్న జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కన్నతల్లిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ప్రేమ వ్యవహారం కారణంగా కూతురు ఇంతటి దారుణానికి ఒడిగట్టడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. తన చెల్లిని అత్యంత కిరాతకంగా చంపిన వారిని కఠినంగా శిక్షించాలంటూ పోలీసులను మృతురాలి సోదరి శోభ వేడుకుంటుంది.