అంతర్జాతీయం

Donald Trump: భారత్‌-పాక్‌ మధ్య యుద్ధం ఆపినా.. నోబుల్ ప్రైజ్ కూడా ఇవ్వరా?

Donald Trump: భారతదేశం-పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపినందుకు నాకు నోబెల్ బహుమతి లభించదని ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశాడు. సెర్బియా- కొసావో మధ్య యుద్ధాన్ని ఆపినందుకు నాకు నోబెల్ బహుమతి లభించదు, ఈజిప్ట్- ఇథియోపియా మధ్య శాంతిని కాపాడినందుకు నాకు నోబెల్ శాంతి బహుమతి లభించదు పశ్చిమాసియాలో అబ్రహం ఒప్పందాలను చేసినందుకు నాకు నోబెల్ శాంతి బహుమతి లభించదని ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశాడు. రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-ఇరాన్‌తో సహా ఏమి చేసినా నాకు నోబెల్ శాంతి బహుమతి లభించదన్నాడు. ఆ ఫలితాలు ఏమైనప్పటికీ, ప్రజలకు తెలుసని ఆవేదన వ్యక్తం చేశాడు.

డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో – రువాండా మధ్య వాషింగ్టన్‌లో జరిగిన శాంతి ఒప్పందానికి ఘనత వహించిన సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ఈ వ్యాఖ్యలు చేశారు. ఇది ఆఫ్రికాకు గొప్ప రోజు, చాలా స్పష్టంగా చెప్పాలంటే, ప్రపంచానికి గొప్ప రోజు. దీనికి నాకు నోబెల్ శాంతి బహుమతి లభించదని ట్రంప్ అన్నాడు.

ఇండియా-పాకిస్తాన్ కాల్పుల విరమణకు అమెరికా కీలక భూమిక పోషించిందన్న అభిప్రాయాన్ని ఇండియా ఆమోదించకపోయినప్పటికీ ఇటు ట్రంప్-అటు పాకిస్తాన్ పదేపదే ఇదే ప్రస్తావన చేస్తున్నాయి. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాద దాడికి బదులు ఇండియా ఆపరేషన్ సిందూర్ దాడులతో దూకుడు ప్రదర్శించింది.

ఆపరేషన్ సిందూర్ కింద ముఖ్యమైన నూర్ ఖాన్ వైమానిక స్థావరంతో సహా దేశంలోని అనేక వైమానిక స్థావరాలపై భారతదేశం దాడి చేసిన తర్వాత, పాకిస్తాన్ సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్ మే 10న తన భారత ప్రతిరూపంతో మాట్లాడటానికి ప్రయత్నించారని భారతదేశం వాదించింది. నాలుగు రోజుల పాటు జరిగిన తీవ్రమైన సరిహద్దు డ్రోన్, క్షిపణి దాడుల తర్వాత సంఘర్షణను ముగించడానికి మే 10న భారతదేశం పాకిస్తాన్ ఒక అవగాహనకు వచ్చాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button