తెలంగాణ
KTR: ఈ-కార్ కేసులో కేటీఆర్కు ఏసీబీ కీలక ఆదేశాలు

KTR: ఫార్ములా ఈ-కార్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఏసీబీ కీలక ఆదేశాలు జారీ చేసింది. మంత్రిగా ఉన్న సమయంలో వాడిన ఫోన్స్ను తీసుకురావాలని ఏసీబీ చె ప్పింది. సాయంత్రం మూడు గంటల్లో ఏసీబీ ఆఫీస్లో సబ్మిట్ చేయాలని ఆదేశించింది. మరోవైపు ఏసీబీకి ఫోన్, ల్యాప్టాప్ ఇవ్వాల్సిన అవసరం లేదంటోంది కేటీఆర్ లీగల్ టీం.
వ్యక్తి గత సమాచారం అడిగే హక్కు ఏసీబీకి లేదని వాదిస్తోంది. ప్రభుత్వ లావాదేవీలకు సంబంధించిన కోర్టు తీర్పు లేనప్పుడు ఫోన్ అడిగే హక్కు లేదంటున్నారు అడ్వొకేట్లు. ఇక ఒకవేళ ఇవాళ ఫోన్ తేకుంటే కేటీఆర్కు మళ్లీ నోటీసులు ఇచ్చే ఛాన్స్ ఉందనే టాక్ వినబడుతోంది.