తెలంగాణ
Mahesh Kumar Goud: కేసీఆర్, కేటీఆర్ సిగ్గుతో తలదించుకోవాలి

Mahesh Kumar Goud: ఫోన్ ట్యాపింగ్ కేసులో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ నాయకుల ఫోన్ ట్యాపింగ్ జరిగిందని మహేష్ కుమార్గౌడ్ ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ హేయమైన చర్య అని ఆయన విమర్శించారు. మా మూమెంట్స్ అన్ని కూడా ట్రాక్ చేసారని అన్నారు.
ఈ ఫోన్ ట్యాపింగ్ లిస్ట్లో సీఎం రేవంత్ సహా 650 మందికిపైగా కాంగ్రెస్ నేతల ఫోన్ నెంబర్లు ఉన్నాయని అన్నారు. ఎన్నికలకు ముందే ఫోన్లు ట్యాప్ అయినట్లు తాము ఫిర్యాదు చేశామని ఆయన గుర్తు చేశారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి మా ఫోన్లు ట్యాప్ చేయడమే కారణమన్నారు. మావోయిస్టుల సానుభూతిపరుల పేరుతో మా ఫోన్లు ట్యాప్ చేశారని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు.