TTD: సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారంపై టీటీడీ సీరియస్

TTD: తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టకు భంగం కలిగేలా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై టీటీడీ సీరియస్ అయింది. టీటీడీపై అవాస్తవాలు ప్రచారాలు చేస్తున్నారని మండిపడింది. వివాదాలకు చెక్ పెట్టేందుకు టీటీడీ చర్యలు తీసుకోనుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశాలపై ప్రత్యేక నిఘా ఉంచి అసత్యాలను, దుష్ప్రచారాన్ని అడ్డుకట్ట వేసే దిశగా చర్యలకు ఉపక్రమించింది. అసలు టీటీడీ ఎలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోనుంది..? టీటీడీ ఆలోచన ఏంటి…? నిజానిజాలు ఎలా నిర్ధారిస్తారు…?
ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ప్రతి ఒక్కరి చేతిలో ఓ స్మార్ట్ ఫోన్.. ఆ ఫోన్లో కచ్చితంగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ట్విట్టర్ ఎక్స్, ట్రేడ్స్ ఇలా అనేక సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్స్ను వినియోగిస్తున్నారు ప్రజలు. ఒక్క పోస్ట్ వైరల్ చేయాలన్న ఒక సంస్థ ప్రతిష్ట దిగజార్చాలన్న సోషల్ మీడియాలో సులువైన పనిగా మారింది.
ఇక అనేక అంశాలు ప్రస్తుతం సోషల్ మీడియా యూజర్లు తమ అకౌంట్ ద్వారా అభిప్రాయాలను షేర్ చేస్తూ వస్తున్నారు. కొన్ని సున్నితమైన అంశాలను సైతం సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తున్న పరిస్థితులు అనేకం.
ఇదే కోణంలో తిరుమలపై కొంత మేర దుష్ప్రచారం జరుగుతోంది. కొందరు భక్తులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తున్నారు. తిరుమలలో సౌకర్యాలలో లోపాల గురించి చెబుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వీడియోలు టీటీడీకీ తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. దీంతో సోషల్ మీడియాలో పోస్టింగ్లపై టీటీడీ కఠినంగా వ్యవహరిస్తోంది టీటీడీ. ముఖ్యంగా తిరుమలలో వరుస ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయిన నేపథ్యంలో ప్రత్యేక చర్యలు చేపడుతోంది.
సోషల్ మీడియాలో పోస్టింగులపై చట్టపరమైన చర్యలకు ఉపక్రమించేలా టీటీడీ చర్యలు చేపట్టింది. ఇలాంటి ఘటనలపై మానిటరింగ్ చేయడానికి టీటీడీ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయనుంది. విభాగం ఎలా ఉండాలి సోషల్ మీడియాలో వస్తున్న కథనాలకు ఎలా చెక్ పెట్టాలనే ధోరణిలో పూర్తి స్థాయి సమీక్ష జరుపుతోంది. ఐటీ విభాగంతో అధికారులు చర్చలు సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే కల్యాణ వేదికలో నమాజ్ చేసిన వ్యక్తితో పాటు ఆ వీడియో తీసిన వ్యక్తిపై సైతం కేసులు నమోదు చేశారు.
వీడియో తీసిన వ్యక్తి వైసీపీ సానుభూతి పరుడిగా పాలకమండలి సభ్యులు విమర్శలు చేశారు. ఇక పొట్టకూటి కోసం ఫోటోగ్రాఫర్గా జీవనోపాధి పొందుతున్న ఆ ఫోటోగ్రాఫర్ లైసెన్స్ను రద్దు చేసింది టీటీడీ. కేవలం వీడియో తీసి మీడియాకు సమాచారం ఇవ్వడంతో అతని లైసెన్స్ను రద్దు చేసినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.
మరోవైపు.. క్యూలైన్స్లో ఓ భక్తుడు అరిచి గోలపెట్టి టీటీడీకి వ్యతిరేకంగా నినాదాలు చేసిన వీడియో.. వేగంగా వైరల్ అయింది. దీంతో వెంటనే ఆ భక్తుడిని గుర్తించిన టీటీడీ అతని వద్దే క్షమాపణలు చెప్పేలా చేసింది. ఆ వీడియో తీసిన టీటీడీ ఉద్యోగిపై చర్యలకు ఆదేశించింది. తాజాగా తిరుమలలోని పీసీసీ4 వద్ద కొందరు భక్తులు పొగాకు తాగుతూ కనిపించారు. రోడ్డుపై బైఠాయించి చుట్ట తాగిన వీడియోను ఓ దుకాణంలో పనిచేసే వ్యక్తి చిత్రీకరించాడు. సీసీ ఫుటేజ్ ఆధారంగా వీడియో తీసిన వ్యక్తిని ఆ వ్యక్తి పనిచేసే దుకాణం లైసెన్స్ను టీటీడీ విజిలెన్స్ స్వాధీనంగా చేసుకుంది.
అయితే.. తప్పు చేసిన వారిపై కాకుండా తప్పును ఎత్తి చూపే వారిపై టీటీడీ చర్యలు తీసుకుంటోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కొందరు మీడియా ప్రతినిధులకు సైతం తమకు చెప్పనిదే వార్త రాయరాదనే నిబంధనలు పెట్టినట్లు సమాచారం. వరుసగా జరిగిన ఘటనలను ముందస్తు ప్రచారం చేసిన సదరు మీడియా ప్రతినిధులను సున్నితంగా టీటీడీ హెచ్చరించిందట. హద్దు దాటితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిందనే టాక్ ఉంది.
మొత్తానికి తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై మరి చూడాలి టీటీడీ కేవలం సోషియల్ మీడియా పైనే ఆంక్షలు పెడుతుందా మీడియాపైనా రుద్దే ప్రయత్నం చేస్తుందో ఆ దేవుడికే ఎరుక.