తెలంగాణ
Phone Tapping Case: తెలంగాణలో హాట్ టాపిక్గా మారిన ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్

Phone Tapping Case: తెలంగాణలో హాట్ టాపిక్గా మారిన ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్లో సిట్ దూకుడు పెంచింది. ఈ కేసులో నిందితులుగా ఉన్నవాళ్లందరినీ వరుసపెట్టి విచారిస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబీ మాజీ చీఫ్ టీ ప్రభాకర్ రావును మూడోసారి ప్రశ్నించనున్నారు. ప్రణీత్ రావు ఇచ్చిన స్టేట్మెంట్పై ప్రభాకర్ రావును విచారించన్నారు సిట్ అధికారులు.
అయితే బీజేపీ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేశారని, ముఖ్యంగా ధర్మపురి అర్వింద్, జితేందర్ రెడ్డి ఫోన్లు ట్యాప్ చేసేందుకు యత్నించినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ప్రణీత్ రావు ఇచ్చిన స్టేట్మెంట్లతో మొత్తం కూపీ లాగనున్నారు అధికారులు. ఇక ప్రభాకర్ రావును ఏం అడగబోతున్నారు, ఏం ఆరా తీయబోతున్నారు. అనేది ఆసక్తి రేపుతోంది.