బంగ్లాదేశ్ ఎన్నికలపై క్లారిటీ

Bangladesh Elections: బంగ్లాదేశ్ ఎన్నికలపై చర్చలకు పుల్ స్టాప్ పడింది. కీలక ప్రకటన వెలువడింది. తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు ముహమ్మద్ యూనస్ ఎన్నికలు ఎప్పుడనేది వెల్లడించారు. దీంతో ఎన్నికలపై వచ్చిన ఒత్తిడి, ప్రశ్నలకు తెరదించినట్టైంది.
బంగ్లాదేశ్ ఎన్నికలపై ఎట్టకేలకు ఓ క్లారిటీ వచ్చింది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు ముహమ్మద్ యూనస్.. దేశంలోని ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే చర్చలకు తెరదింపారు. బాధ్యతలు చేపట్టిన 10 నెలల తర్వాత, యూనస్ బంగ్లాదేశ్లో ఎన్నికలను ప్రకటించారు. ఒకవైపు వివిధ రాజకీయ పార్టీల నుంచి వస్తున్న ఒత్తిడి, మరోవైపు ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ల మధ్య యూనస్ దేశంలో ఎన్నికలు ఎప్పుడు నిర్వహించబోయేదీ వెల్లడించారు.
2025లో బంగ్లాదేశ్లో చోటుచేసుకున్న తిరుగుబాటు, షేక్హసీనా దేశం విడిచి వెళ్లిపోయిన తర్వాత దేశానికి ముహమ్మద్ యూనస్ తాత్కాలిక సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. అయితే ఆయనపై గత కొంతకాలంగా సార్వత్రిక ఎన్నికల నిర్వహణ ఒత్తిడి పెరిగిపోయింది. ఈ నేపధ్యంలో ఆయన దేశంలో సార్వత్రిక ఎన్నికలు 2026 ఏప్రిల్లో జరుగుతాయని ప్రకటించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ మొదటి అర్ధభాగంలో ఏ రోజునైనా ఎన్నికలు జరిగే అవకాశం ఉందని వెల్లడించారు.
గత నెలలో ముహమ్మద్ యూనస్ తన జపాన్ పర్యటన సందర్భంగా తదుపరి జాతీయ ఎన్నికలు వచ్చే ఏడాది డిసెంబర్ జూన్ మధ్య ఎప్పుడైనా జరుగుతాయని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన ఎన్నికలపై తేదీ ప్రకటించారు.
సముచిత సమయంలో ఎన్నికలకు సంబంధించిన వివరణాత్మక రోడ్మ్యాప్ను ఎన్నికల కమిషన్ మీకు అందిస్తుందని యూనస్ వెల్లడించారు. చైనాకు తన ప్రతిపాదనల తర్వాత యూనస్ ఇటీవలి నెలల్లో వివాదానికి గురయ్యాడు. డిసెంబర్ 2025, జూన్ 2026 మధ్య ఎన్నికలు నిర్వహిస్తానని గతంలో ప్రకటించాడు.
అయితే దేశ రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషించే BNPతో సహా రాజకీయ పార్టీలు ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి ఎన్నికలకు సంబంధించిన రోడ్మ్యాప్ను ఆశించాయి. ఈద్ అల్-అధా సందర్భంగా జాతినుద్దేశించి చేసిన టెలివిజన్ ప్రసంగంలో యూనస్ ఎన్నికల గురించి ప్రకటించారు. ఎన్నికల సంఘం త్వరలో వివరణాత్మక ఎన్నికల రోడ్మ్యాప్ను రూపొందిస్తుందని ఆయన అన్నారు.
న్యాయం, పాలన ఎన్నికల ప్రక్రియకు సంబంధించి జరుగుతున్న సంస్కరణలను సమీక్షించిన తర్వాత తదుపరి జాతీయ ఎన్నికలు 2026 ఏప్రిల్ మొదటి అర్ధభాగంలో ఏ రోజున జరుగుతాయో తాను ప్రకటిస్తున్నానని యూనస్ అన్నారు.
గత ఏడాది బంగ్లాదేశ్లో ప్రభుత్వ ఉద్యోగ కోటా వ్యవస్థలో సంస్కరణల కోసం డిమాండ్ చేస్తూ రాజకీయ తిరుగుబాటు చోటుచేసుకుంది. గత నెలలో మాజీ ప్రధాన మంత్రి ఖలీదా జియాకు చెందిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, డిసెంబర్ 2025 నాటికల్లా సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాలని వివాదాస్పద సలహాదారులను తొలగించాలని ముహమ్మద్ యూనస్ను కోరింది.
బంగ్లాదేశ్లో స్వేచ్ఛగా, న్యాయంగా అందరినీ కలుపుకుని ఎన్నికలు త్వరగా నిర్వహించాలని భారతదేశం ఇంతకుముందు పిలుపునిచ్చింది. అదే సమయంలో షేక్ హసీనా అవామీ లీగ్పై పొరుగు దేశం నిషేధం గురించి ఆందోళన వ్యక్తం చేసింది.
2024లో బంగ్లాదేశ్ రాజకీయ గందరగోళంలో మునిగిపోయింది. దేశవ్యాప్తంగా విస్తృత నిరసనలు చెలరేగాయి. దీని ఫలితంగా ఆగస్టులో ప్రధాన మంత్రి షేక్ హసీనా రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆమె భారతదేశంలో ప్రవాసంలో ఉన్నారు. హసీనా, ఆమె మాజీ సహచరులు నిరసనకారులపై క్రూరమైన బలప్రయోగం చేశారని ప్రాసిక్యూటర్లు ఆరోపించిన తర్వాత ఐసిటి ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ అభియోగాలను పరిగణనలోకి తీసుకుంది.