తెలంగాణ
తిప్పాపురం గోశాలలో ఆగని కోడెల మృతి

సిరిసిల్లా జిల్లా వేములవాడ రాజన్న ఆలయానికి చెందిన తిప్పాపురం గోశాలలో కోడెల మృతి ఆగడం లేదు. అనారోగ్యంతో ఇవాళ మరో నాలుగు ఆవులు మృతి చెందాయి. మరోవైపు అనారోగ్యంతో మరో 12 ఆవులు బాధపడుతున్నట్లు సమాచారం. కాగా ఇప్పటివరకు గోశాలలో 30 ఆవులు మృతి చెందాయి. దీంతో హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
రాజన్న ఆలయ గోశాలలో ప్రస్తుతం 1,300 కోడెలు ఉన్నాయి. దీంతో గోశాలలోనే వెటర్నరీ డాక్టర్ల బృందం వాటి ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు ప్రతిరోజు గోశాలను పర్యవేక్షిస్తున్నారు జిల్లా కలెక్టర్. వైద్య సేవల వివరాలను స్వయంగా అడిగి ఆరా తీస్తున్నారు. అదేవిధంగా కోడెలకు దాణా, పచ్చిగడ్డిని పరిశీలిస్తున్నారు.