సినిమా

బాహుబలి రీ-రిలీజ్: రెండు భాగాలు ఒకే సినిమాగా

Baahubali Re-Release: బాహుబలి సినిమా మళ్లీ థియేటర్లలో సందడి చేయనుంది! పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు రాజమౌళి కలిసి సృష్టించిన ఈ చిత్రం రెండు భాగాలను ఒకే సినిమాగా మార్చి అక్టోబర్‌లో విడుదల చేయనున్నారు. ఈ కొత్త ట్రీట్‌పై అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు.

భారతీయ సినిమా చరిత్రలో మైలురాయిగా నిలిచిన బాహుబలి సినిమా మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ప్రభాస్ హీరోగా, రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ పాన్ ఇండియా చిత్రం రెండు భాగాలుగా విడుదలై బాక్సాఫీస్ వసూళ్లలో రికార్డులు సృష్టించింది. ఇప్పుడు మేకర్స్ కొత్త ఆలోచనతో ముందుకొచ్చారు.

బాహుబలి 1, 2 భాగాలను ట్రిమ్ చేసి ఒకే సినిమాగా రూపొందించి అక్టోబర్‌లో థియేటర్లలో విడుదల చేయనున్నారని సమాచారం. ఈ కొత్త వెర్షన్‌తో ప్రేక్షకులకు మరోసారి బాహుబలి మ్యాజిక్‌ను అందించేందుకు టీమ్ సన్నాహాలు చేస్తోంది. ఈ రీ-రిలీజ్‌తో థియేటర్లు మరోసారి హౌస్‌ఫుల్ కావడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ విషయంపై త్వరలో అధికారిక ప్రకటన రానుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button