ఆంధ్ర ప్రదేశ్
గోదావరిలో ఈతకు వెళ్లి ఎనిమిది మంది మృతి

కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కమినిలంకలో విషాదం చోటుచేసుకుంది. గోదావరిలో ఈతకు వెళ్లి ఎనిమిది మంది చనిపోయారు. నిన్నటి నుంచి కొనసాగిన గాలింపు చర్యలు ముగిశాయి. ఇక పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ముమ్మిడివరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితుల కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇక మృతుల కుటుంబాలను ఆదుకుంటామన్నారు ఎమ్మెల్యే సుబ్బరాజు. ఎనిమిది మంది చనిపోవడం బాధాకరమన్నారు.